Connect with us

మెలోడియస్‌గా ఆకట్టుకుంటున్న నితిన్ ‘డేంజర్ పిల్లా’ సాంగ్ ప్రోమో..

Latest Cinema news

మెలోడియస్‌గా ఆకట్టుకుంటున్న నితిన్ ‘డేంజర్ పిల్లా’ సాంగ్ ప్రోమో..

గత ఏడాది ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ తన తదుపరి చిత్రానికి కాస్త ఎక్కువగానే గ్యాప్ తీసుకున్నారు. తన తరువాతి చిత్రం పేరు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అని ఇటీవలే ఒక పోస్టర్‌తో ప్రకటించారు. హీరోగా నితిన్‌కు 32వ చిత్రం ఇది. ఇందులో ఆయన లుక్ చాలా భిన్నంగా ఉండనుందని పోస్టర్‌తోనే అందరికీ అర్థమైపోయింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలకానుందంటూ గత రెండు రోజులుగా అభిమానులను ఊరిస్తూ వచ్చారు నితిన్. ‘డేంజర్ పిల్లా’ అంటూ సాగే పూర్తి పాటను ఆగస్టు 2న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. మరి, ఆ ప్రోమో ఎలా ఉంది? అభిమానులను ఎలా ఆకట్టుకుంటోంది? ఓసారి మనమూ చూద్దాం రండి..

చాలా రోజుల తర్వాత హరీశ్ జయరాజ్ తెలుగులో నేరుగా సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘డేంజర్ పిల్లా.. పిల్లా.. ఓ ఏంజెల్లా.. డ్యూయెల్ రోలా..’ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోలో నితిన్, శ్రీలీల మధ్య ఉండే కెమిస్ట్రీని మనం అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు డేంజర్‌గా అనిపిస్తూనే; మరోవైపు ఏంజెల్‌లా కవ్విస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో నితిన్ ఒక స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. ఈ ప్రోమోలో హరీష్ జయరాజ్ మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నితిన్ చెప్పినట్లుగానే చాలా హాయిగా సాగిపోయే మెలోడియస్ గానం ఇది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా; అర్మాన్ మాలిక్ ఆలపించారు.

ఈ చిత్రంలో నితిన్‌కు జంటగా శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రతి సాధారణ వ్యక్తి వెనుక ఒక అసాధారణ కథ ఉంటుంది. అలాంటి ఒక ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కథే ఇది. దీని ద్వారా ప్రేక్షకులకు మరింత ఎక్కువ ప్రేమ మరియు వినోదాన్ని పంచడానికి వేచి చూస్తున్నాం.. అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నితిన్. వక్కంతం వంశీ రాసుకున్న కథకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, రాజ్‌కుమార్ ఆకెళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే హరీశ్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో పాటు నితిన్ ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ కోసం కూడా పని చేయనున్నారు. వెంకీ కుడుములతో కలిసి VNRTrio (వర్కింగ్ టైటిల్) ని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. ఇందులో రష్మిక మందన కథానాయికగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురు కాంబినేష్లో విడుదలైన ‘భీష్మ’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి, ఈ కాంబో ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తే అదే మ్యాజిక్ వర్కవుట్ అవుతుందో, లేదో చూడాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

READ ALSO  శీలీలా రెడ్ డ్రస్స్ హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టడం లేదు
google news
Continue Reading
To Top