Uncategorized
అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న దీపికా పదుకొనె…
ప్రస్తుతం యావత్ భారతదేశం మొత్తం మార్చి 12న జరగబోయే 95 వ అకాడమీ అవార్డ్స్ కోసం ఎదురుచూస్తోంది. మన దేశం తరపున అధికారిక ఎంట్రీ లభించకపోయినా దర్శక ధీరుడు రాజమౌళి ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిలిపి చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసమే 50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్.
ఇప్పటికే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది కాబట్టి, ఆస్కార్ రావడం పక్కా. అందుకే ఆర్ ఆర్ ఆర్ టీమ్ మెంబర్స్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వనున్నారు సింగర్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అయితే వీరితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఆస్కార్ వేడుకకు వెళ్లేందుకు రౌడీ అవుతుంది. తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది దీపిక. ఈసారి ఆస్కార్ వేడుకల్లో అవార్డ్ ప్రజెంటర్ గా దీపిక కు ఆహ్వానం అందింది. ప్రెజెంటర్ లిస్ట్ లో ద్వైన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్ లాంటి హాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
వీళ్ళతో కలిసి అవార్డ్స్ ప్రెజెంట్ చేయబోతోంది దీపిక. గతంలో 2016 ఆస్కార్ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ విజేతగా అవార్డును అందజేసింది. దాంతో ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్ గా వ్యవహరించనున్న రెండో ఇండియన్ నటి గా దీపిక పదుకొనె నిలబడి ఉంది. లేకపోతే రీసెంట్ గా పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే లో హీరోయిన్ గా నటిస్తుంది. 2024 సంక్రాంతి కి ప్రాజెక్టు కే రిలీజ్ కానుంది.