Latest News
పవన్ హరిహర వీరమల్లు అసలు రిలీజ్ అవుతుందా లేదా…
టాలీవుడ్ లో ఆ హీరోతో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల. ఇది ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఓ పీడకల. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం. అప్పుడెప్పుడో మొదలైన ఓ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఫినిష్ కాకపోవడంతో హీరో డేట్స్ కోసం చెకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు రెండేళ్ల క్రితమే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు.
అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హరిహర వీరమల్లుని మొదట 2021 లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన యూనిట్ తర్వాత 2022 సమ్మర్ కి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత 2023 సంక్రాంతి అన్నారు. చివరగా ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయడం పక్కా అని కామెంట్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా 60% షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే దాదాపు 40% షూటింగ్ పెండింగ్ లో ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీర మల్లు ప్రాజెక్టుని మొదలుపెట్టి మరో మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజి ఫిక్స్ అయ్యాయి. క్రిష్ సినిమా తర్వాతే ఈ రెండు ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు కొత్తగా పిటిఎస్టిడి ప్రాజెక్టు ముందు వరుసలోకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల కాల్ షీట్స్ ఇస్తే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోతుందట.
అందుకే మిగతా ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి ఈ రీమేక్ ని స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. పి టి ఎస్ టి డి ప్రాజెక్టు తర్వాత ఎప్పటినుంచో వేచి చూస్తున్నా హరిష్ శంకర్ సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట పవన్. ఇదే జరిగితే వీరమల్లుకి ఇప్పట్లో విముక్తి కలిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అంటే ఇంకా ఒక సంవత్సరం మాత్రమే టైముంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టి బస్సు యాత్ర మొదలుపెడితే ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న సినిమా మాత్రమే కంప్లీట్ అవుతుంది. మిగిలిన మూడు పెండింగ్ లో ఉంటాయి. ఎలక్షన్ రిజల్ట్ ని బట్టి వాటి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఇదే ఇప్పుడు హరిహర వీరమల్లు టీమ్ ని టెన్షన్ పెట్టే మ్యాటర్ గా మారింది.