Latest Cinema news
మాసివ్ ముంబై చాప్టర్ కిక్ ఆఫ్..కుబేర కొత్త షెడ్యూల్..
ఆనంద్, గోదావరి లాంటి క్లాస్ చిత్రాలతో తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అతను తీసే ప్రతి సినిమా ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ తో మనసును టచ్ చేస్తుంది. కథలలో పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత వాటి చుట్టూ జరిగే కథనం నిజజీవితంలో మన చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్ ను గుర్తుచేస్తాయి. అందుకే అతను సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
ఈమధ్య నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. శేఖర్ కమ్ముల చిత్రాలలో పాటలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇతను తీసిన ప్రతి సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ ప్రేక్షకుల మనసులు దోచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ తాజాగా ధనుష్ ,నాగార్జున తో కుబేర చిత్రం తెరకెక్కిస్తున్నారు.
తనకు అలవాటు ఉన్న క్లాస్ టచ్ కాకుండా మంచి మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని శేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఇందులో నాగార్జున ఓ కూల్ పోలీస్ ఆఫీసర్ గా మంచి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. శివమణి లాంటి చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో దంచి కొట్టిన నాగార్జున చాలా లాంగ్ యాప్ తర్వాత తిరిగి మళ్ళీ పోలీస్ గా కనిపిస్తున్నారు. నాగ్..ద గోస్ట్ మూవీ లో స్పెషల్ ఆఫీసర్ గా కనిపించిన పోలీస్ యూనిఫాంలో కనిపిస్తే ఆ థ్రిల్ డిఫరెంట్ గా ఉంటుంది కదా.
ఏ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. మొన్నటివరకు బ్యాంకాక్ లో ఈ మూవీకి సంబంధించిన ఒక సుదీర్ఘ షెడ్యూల్ను కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముంబైలో కొత్తగా మరొక షెడ్యూల్ ప్రారంభమైంది. మాసివ్ ముంబై చాప్టర్ కిక్ ఆఫ్ అంటూ దీనికి సంబంధించి చిత్ర బృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఒక పైప్ లైన్ పై నిలబడి ఉన్న ధనుష్ సిటీ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న స్టిల్ ఈ పోస్టర్ కి హైలైట్ గా నిలిచింది. ఇక ముంబైలో జరగబోయే 12 రోజుల షెడ్యూల్లో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొనబోతున్నారు.