News
Swarnakamalam: సినిమాలో ఆ సీన్ ఎందుకు చేశారన్న అభిమానులు.. అవాక్కయిన వెంకటేశ్..
కళాతవస్వి కె.విశ్వనాథ్ (K. Vishwanath) సృష్టించిన ఓ అద్భుత చిత్రం స్వర్ణకమలం(Swarnakamalam) . కళ మనుసుని ఆహ్లాదపరుస్తుంది. ఆ నిజాన్ని అర్థం చేసుకుని కళను ఔపోనస పట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రంగుల లోకంలో విహరించాలని ఆశపడే మీనాక్షి అనే నాట్యకారిణి కథే స్వర్ణకమలం. మీనాక్షిగా భానుప్రియ (Bhanu Priya)) నటించగా.. ఆ కలలలోకం నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చే మరో చిత్రకళాకారుడు చంద్రంగా వెంకటేశ్ (Venkatesh) నటించారు.
ఈ సినిమాలో విశ్వనాథ్ స్పృశించని అంశం లేదు. పాశ్చాత్య పోకడలకు యువత ఎలా ఆకర్షితమవుతున్నారని చెబుతూనే.. భారతీయ సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటి చెప్పారు. ఈ సినిమా విజయంలో కథతో పాటు పాటలూ కీలకపాత్ర పోషించాయి. ఇళయరాజా సంగీతానికి, సిరివెన్నెల సాహిత్యం తోడైంది.
స్వర్ణకమలంలోని ప్రతి పాటా అద్భుతమే. అయితే ఈ సినిమా పాటల విషయంలో మాత్రం హీరో వెంకటేశ్ అభిమానుల నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదుర్కున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు విశ్వనాథ్ తో కలసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘అందెల రవమిది’ భానుప్రియ పాదాన్ని చేతితో తన మోకాళ్లపై పెట్టుకుంటారు. ఈ స్టిల్ సినిమా పోస్టర్ గా విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా అందంగా ఉంటుందని వెంకటేశ్ అన్నారు.
‘కొత్తగా రెక్కలొచ్చెనా..’ పాటలో గజ్జెలు కడిగి వాటిని తన చొక్కాకు తుడిచి భానుప్రియ కాళ్లకు కడతారు వెంకటేశ్. ఈ విషయంలోనే ఆయన్ను అభిమానులు ప్రశ్నించారట.
సినిమా విడుదలైన తర్వాత మీరు అలా అమ్మాయి కాళ్లు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారట అభిమానులు. అయితే తాను దాని గురించి అలా ఏమీ ఆలోచించడం లేదని, అలా తాకడానికి తనకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పారట.