Connect with us

Swarnakamalam: సినిమాలో ఆ సీన్ ఎందుకు చేశారన్న అభిమానులు.. అవాక్కయిన వెంకటేశ్..

News

Swarnakamalam: సినిమాలో ఆ సీన్ ఎందుకు చేశారన్న అభిమానులు.. అవాక్కయిన వెంకటేశ్..

కళాతవస్వి కె.విశ్వనాథ్ (K. Vishwanath) సృష్టించిన ఓ అద్భుత చిత్రం స్వర్ణకమలం(Swarnakamalam) . కళ మనుసుని ఆహ్లాదపరుస్తుంది. ఆ నిజాన్ని అర్థం చేసుకుని కళను ఔపోనస పట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రంగుల లోకంలో విహరించాలని ఆశపడే మీనాక్షి అనే నాట్యకారిణి కథే స్వర్ణకమలం. మీనాక్షిగా భానుప్రియ (Bhanu Priya)) నటించగా.. ఆ కలలలోకం నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చే మరో చిత్రకళాకారుడు చంద్రంగా వెంకటేశ్ (Venkatesh) నటించారు.

ఈ సినిమాలో విశ్వనాథ్ స్పృశించని అంశం లేదు. పాశ్చాత్య పోకడలకు యువత ఎలా ఆకర్షితమవుతున్నారని చెబుతూనే.. భారతీయ సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటి చెప్పారు. ఈ సినిమా విజయంలో కథతో పాటు పాటలూ కీలకపాత్ర పోషించాయి. ఇళయరాజా సంగీతానికి, సిరివెన్నెల సాహిత్యం తోడైంది.

స్వర్ణకమలంలోని ప్రతి పాటా అద్భుతమే. అయితే ఈ సినిమా పాటల విషయంలో మాత్రం హీరో వెంకటేశ్ అభిమానుల నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదుర్కున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు విశ్వనాథ్ తో కలసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

#image_title

‘అందెల రవమిది’ భానుప్రియ పాదాన్ని చేతితో తన మోకాళ్లపై పెట్టుకుంటారు. ఈ స్టిల్ సినిమా పోస్టర్ గా విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా అందంగా ఉంటుందని వెంకటేశ్ అన్నారు.

‘కొత్తగా రెక్కలొచ్చెనా..’ పాటలో గజ్జెలు కడిగి వాటిని తన చొక్కాకు తుడిచి భానుప్రియ కాళ్లకు కడతారు వెంకటేశ్. ఈ విషయంలోనే ఆయన్ను అభిమానులు ప్రశ్నించారట.

సినిమా విడుదలైన తర్వాత మీరు అలా అమ్మాయి కాళ్లు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారట అభిమానులు. అయితే తాను దాని గురించి అలా ఏమీ ఆలోచించడం లేదని, అలా తాకడానికి తనకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పారట.

READ ALSO  మహేష్ బాబు కి కేజిఎఫ్ ఫైట్ మాస్టర్స్ నచ్చలేదా...
google news
Continue Reading
To Top